యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.
యేసు సమరయలోని ఒక చారిత్రాత్మక ప్రదేశానికి వెళ్లాడు, ఏబాలు పర్వతం మరియు గెరిజిమ్ పర్వతం మధ్య ఉన్న యాకోబు బావి.
కాబట్టి
“కాబట్టి” అనే పదం మొదటి మూడు వచనముల నుండి ఒక అనుమితిని పొందింది. యూదులు మరియు అన్యుల మధ్య ఉన్న ఉద్రిక్తతను యేసు పూర్తిగా విస్మరించాడు. పక్షపాతాన్ని ఎదుర్కొంటూ అక్కడికి వెళ్లాడు. యేసు తన మిషన్లో అందరినీ చేర్చుకున్నాడు.
యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న
20 సంవత్సరాల తర్వాత, యాకోబు కనానుకు తిరిగి వచ్చినప్పుడు షెకెము నగరానికి సమీపంలో ఒక భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అతను మరణించే సమయానికి యోసేవుకు ఈ ఆస్తిని ఇచ్చాడు (ఆది 48:22). యోసేపు అక్కడ పాతిపెట్టబడ్డాడు.
యోసేవు బావికి సంబంధించిన ఈ సూచన మరియు గెరిజిమ్ పర్వతం (యోహాను 4:20) ప్రస్తావన సమరయ మహిళతో జరిగిన సంభాషనను చాలా ప్రసిద్ధ ప్రదేశంలో ఉంచుతుంది. యోసేవు బావి ప్రాంతము ఖచ్చితంగా ఉంది. ఇది దాదాపు 100 అడుగుల లోతులో ఉంది. ఈ ప్రదేశంలో అనేక నీటి బుగ్గలు ఉన్నాయి.
సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.
సుఖారు గెరిజీము పర్వతం మరియు యేబాలు పర్వతం యొక్క తూర్పున ఉంది. కొంతమంది వాదించినట్లుగా, సుఖారు షెకెము కాదు, కానీ అది సమరయలో అత్యంత ముఖ్యమైన నగరంగా షెకెమును భర్తీ చేసింది. సుఖారు బహుశా గెరిజిమ్ పర్వతానికి ఎదురుగా ఎబాల్ పర్వతం భుజంపై ఉన్న అస్కర్ యొక్క ఆధునిక గ్రామం. యేసు తర్వాత “మంచి సమరయుని” కథ చెప్పాడు.
షెకెమ్ పట్టణానికి సమీపంలోని యాకోబు బావి నుండి ” సుఖారు ” దాదాపు అరమైలు దూరంలో ఉంది. ఈ నగరం ఎబాల్ పర్వతం వాలుపై ఉంది. గెరిజిమ్ మరియు ఏబాల్ పర్వతాలు శపము మరియు ఆశీర్వాదం సూచించు పర్వతాలు.
సూత్రం:
తప్పిపోయిన వారి వద్దకు మంచి సాక్షి వెళ్ళును.
అన్వయము :
నికోదేము వేదాంతపరంగా సనాతనమైన, గౌరవం కలిగిన, విధ్యావంతుడు. బావి వద్ద ఉన్న స్త్రీ తృణీకరించబడింది, చదువుకోలేదు మరియు ప్రభావం లేకుండా, నైతికంగా బహిష్కరించబడింది. అయితే, ఇద్దరూ యేసును రక్షకునిగా స్వీకరించాలి.
