అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.
తరువాతి వచనాలలో, సన్హెడ్రిన్ సభలోని ఇద్దరు ప్రముఖ మరియు ధనవంతులైన సభ్యులను మనం చూస్తాము. వారు ఇంతకుముందు యేసును అనుసరించినవారుగా ఉండి, ఇప్పుడు తమ ప్రభువు కోసం ఏదైనా చేయాలని కోరుకున్నారు.
అటుతరువాత,
రోమీయులు సాధారణంగా మృతదేహాన్ని పక్షులు మరియు జంతువులు తినడానికి సిలువపై వదిలివేసేవారు. ఇది క్రీస్తు అనుచరులలో కొందరికి ఒక సమస్యగా మారింది.
యూదుల భయమువలన రహస్యముగా,
యోసేపు తన జీవితంలో ఈ సమయం వరకు ఒక రహస్య విశ్వాసిగా ఉన్నాడు. అతను యేసు దేహమును పిలాతును అడగడానికి ధైర్యం కూడగట్టుకున్నాడు (మార్కు 15:43). ఈ చర్య సన్హెడ్రిన్ ముందు యోసేపును క్రీస్తు శిష్యునిగా కూడా ధృవీకరించింది.
యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు,
యోసేపు ఒక ధనవంతుడు (మత్తయి 27:57). అతను ప్రభావవంతమైన యూదుల సభ అయిన సన్హెడ్రిన్లో సభ్యుడు (మార్కు 15:43). అతను “మంచివాడు మరియు నీతిమంతుడు” (లూకా 23:50). అతను యేసును ఖండించడానికి అంగీకరించలేదు (లూకా 23:51). అరిమతీయ యెరూషలేముకు వాయువ్యంగా సుమారు 20 మైళ్ళ దూరంలో ఉంది.
యేసు శిష్యుడైన యోసేపు, ఆయన ‘శిష్యునిగా’ రాజ్యము కొరకు కనిపెట్టుచుండెను (మార్కు 15:43; మత్తయి 27:57).
తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను.
యెరూషలేములో ఒక ఉన్నత పౌరునిగా యోసేపు, యేసు దేహమును పాతిపెట్టడానికి పిలాతు నుండి అనుమతి కోరాడు. యేసు అప్పటికే మరణించాడని పిలాతు ఆశ్చర్యపోయాడు (మార్కు 15:44). అది నిజమేనా అని అతను అక్కడి శతాధిపతిని అడిగాడు. ఆ సైనికుడు యేసు మరణాన్ని ధృవీకరించాడు.
గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.
యేసు దేహమును పాతిపెట్టుటకు తీసుకువెళ్ళడం ద్వారా, యోసేపు ఇకపై రహస్య శిష్యునిగా ఉండలేకపోయాడు.
సూత్రం:
ఇతరులు ఏమనుకుంటారోనన్న భయమే, ప్రజలు క్రీస్తును గూర్చి చెప్పడంలో విఫలమవడానికి ప్రధాన కారణం.
అనువర్తనం:
యేసు బ్రతికి ఉన్నప్పుడు తమ విశ్వాసమును గూర్చిన ధైర్యము లేని ఇద్దరు వ్యక్తులు, ఆయన సమాధిలో ఆయనను ఘనపరచడానికి ముందుకు వచ్చారు. ఈ వ్యక్తులు, తమ జీవితాలతో ఏమి చేసి ఉండవచ్చో లేదా ఏమి సాధించి ఉండవచ్చోనని గతాన్ని తలచుకున్నారు (జెకర్యా 12:10). యేసు ఎన్నడూ రహస్య శిష్యులను పిలవలేదు.
మన ప్రభువును గూర్చి సాక్ష్యమివ్వకపోవడానికి మూల కారణం ఎగతాళి చేస్తారేమోనన్న భయమే. అది గర్వం లేదా అహంకారానికి సంబంధించిన విషయం (యోహాను 12:43). యోసేపు, నికోదేము ఇద్దరూ తమ సమాజంలో హోదాను కలిగి ఉన్నారు. వారిద్దరూ ధనవంతులు. తమ విశ్వాసాన్ని ఇతరులకు చెప్పకపోవడానికి వారికి మానవ సంబంధమైన కారణాలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు సంక్షోభ సమయాల్లో ధైర్యం తెచ్చుకుంటారు. వారి జీవితాల్లోకి ఒత్తిడి వచ్చి, అసమ్మతి వారి మూల విలువలను మార్చే వరకు వారు పిరికివారిగా ఉన్నారు (మత్తయి 10:32-33).
