ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను 59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.
యేసు చేసిన ఈ ముగింపు వాదన మన్నా యొక్క తాత్కాలిక ప్రభావాన్ని మరియు యేసు ఇచ్చే ఆహారము యొక్క శాశ్వత ప్రభావాన్ని సంగ్రహిస్తుంది.
6:58
ఇదే
ఈ పదబంధం మొత్తం ప్రసంగాన్ని సంగ్రహిస్తుంది.
పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము —
కుమారుడు యేసుగా శరీరాధారి ఆయెను.
పితరులు మన్నాను తినియు
జీవాహారముగా యేసు నిత్యజీవమును ఇచ్చును, మన్నా వంటి తాత్కాలిక జీవితాన్ని కాదు.
చనిపోయినట్టు కాదు
యూదుల పితారులు అరణ్యములో మరణించారు.
ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను.
క్రీస్తును మరియు ఆయన పనిని విశ్వసించువారు ఎన్నటికీ చనిపోరు. విశ్వాసము ద్వారా జీవపు ఆహారమును పొందడం శాశ్వత జీవితాన్ని అందిస్తుంది. విశ్వాసము ద్వారా క్రీస్తు మరణంలో పాల్గొనడం శాశ్వత జీవితాన్ని ఇస్తుంది.
6:59
ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.
గలిలయ సముద్రం ఒడ్డున ఉన్న కపెర్నహూములో ఉన్న సమాజమందిరములో జీవపు ఆహారము ప్రసంగము జరిగింది. జీవపు ఆహారము ప్రసంగము ఒక చారిత్రాత్మక గమనికతో ముగుస్తుంది.
సూత్రం:
ప్రభువుతో నిజమైన సంబంధం నిత్యజీవమునకు మరియు నిత్య మరణమునకు మధ్య ఉన్న తేడా.
అనువర్తనం:
నిజమైన జీవము క్రీస్తులో కనుగొనబడుతుంది (యోహాను 1:4). యేసు విశ్వాసము ద్వారా ఇచ్చిన దానిని వ్యక్తిగతంగా స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి నిత్యజీవమును పొందుతాడు. దీని ఫలితంగా క్రీస్తు మరియు విశ్వాసి మధ్య స్థిరమైన సహవాసము ఏర్పడుతుంది.
